జెరూసలెం, మార్చి 1: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఖమేనీ ఎంతోకాలం జీవించి లేరనడానికి చాలా సంకేతాలు ఉన్నాయన్నారు. ఆదివారం ఉదయం ఖమేనీ ఉంటున్న స్థావరంపై దాడి చేశామన్నారు. గత 30 ఏండ్లుగా ఖమేనీ ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నారని, వాళ్ల దేశ ప్రజలనే అనేకి ఇబ్బందులు పెడుతూ దుఃఖంలో ఉంచేవారని, ఇజ్రాయెల్ దేశాన్ని అంతం చేయడానికి నిరంతరం ప్రయత్నించే వారని ఆరోపించారు. ఖమేనీ మృతితో తమ దాడి ఆగదని, దాడులు కొనసాగుతాయని, రానున్న కొద్ది రోజుల్లో ఆ ఉగ్రవాద గడ్డపై ఉన్న వేలాది లక్ష్యాలపై తాము దాడులు చేస్తామని ఆయన తెలిపారు. పాలనను పడగొట్టి మీ భవిష్యత్ను ఉజ్వలం చేసుకోవాలని ఆయన ఇరాన్ దేశ పౌరులను కోరారు.