పాలస్తీనా: ఇజ్రాయిల్ దళాలు తమ రిపోర్టర్ షిరీన్ అబూ అలేహ్ను చంపినట్లు అల్ జజీరా సంస్థ పేర్కొన్నది. పాలస్తీనా భూభాగంలో పనిచేస్తున్న ఆమె ఇజ్రాయిల్ దళాలు హతమార్చినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది చాలా హేయమైన హత్య అని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇజ్రాయిల్ దళాలు క్రూరంగా తమ రిపోర్టర్ను చంపినట్లు అల్ జజీరా తెలిపింది. కావాలనే తమ జర్నలిస్టును హత్య చేశారని, దీనికి ఇజ్రాయిల్ బాధ్యత తీసుకోవాలని, అంతర్జాతీయ సమాజం ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అల్ జజీరా పేర్కొన్నది. 51 ఏళ్ల అబూ అలేహ్ మృతిచెందినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రి ద్రువీకరించారు. అరబిక్ న్యూస్ సర్వీస్లో అబూ పనిచేస్తోంది. జెనిన్ శరణార్థుల క్యాంపులో బుధవారం ఉదయం ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. అనుమానితులు, భద్రతా దళాల మధ్య అక్కడ ఫైరింగ్ జరిగిందని, ఒకవేళ జర్నలిస్టులు ఎవరైనా గాయపడి ఉంటారేమో అని ఇజ్రాయిల్ చెప్పింది.