ఇస్లామాబాద్: జడ్జిని బెదిరించిన కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఇవాళ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఏప్రిల్ 18వ తేదీలోగా ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాలని ధర్మాసనం ఆదేశించింది. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జీబా చౌదరీ, ఇస్లామాబాద్ పోలీసుల్ని బెదిరిస్తూ ఇమ్రాన్ మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ తరపున కోర్టులో ఫైసల్ చౌదరీ వాదించారు. అయితే కోర్టుకు హాజరుకాకపోవడం వల్ల బెయిలబుల్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్(non bailable arrest warrant)గా మార్చాలని జడ్జీ పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పేవరకు ఇమ్రాన్తో ఎటువంటి చర్చలు ఉండవని ప్రధాని షాబాజ్ షరీఫ్(PM Shabaz sharif) తెలిపారు. ఇమ్రాన్ ఓ ఫ్రాడ్ అని, దేశాన్ని లూటీ చేసినవాళ్లతో చర్చలు చేపట్టడం కరెక్టు కాదన్నారు. న్యాయవ్యవస్థపై దాడి చేశారని, రాజ్యాంగ వ్యవస్థను నమ్మలేదన్నారు.