టెహ్రాన్: ఇటీవల ఇరాన్లో భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం ఓ నిరసనకారుడిని ఉరి తీసింది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసింది ఇరాన్. మోషెన్ షేకారి అనే వ్యక్తిని గురువారం ఉరి తీశారు. ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా అతను నిరసన తెలిపాడు. టెహ్రాన్లో సెప్టెంబర్లో మోషేన్ ఓ రోడ్డుపై ప్రదర్శన చేపట్టాడు. తన వద్ద ఉన్న మచ్చు కత్తితో పారామిలిటరీ దళ సభ్యుడిని గాయపరిచాడు. ఆ ఘటనలో మోషేన్పై విచారణ చేపట్టి అతన్ని దోషిగా తేల్చారు. నిరసనకారులకు క్రమక్రమంగా మరణశిక్షను అమలు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.