టెహ్రాన్: మరణ దండన ఎదుర్కొంటున్న ముగ్గురు నిరసనకారుల్ని ఇరాన్(Iran) అధికారులు ఇవాళ ఉరి తీశారు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిదే. ఆ నిరసన ప్రదర్శల్లో పాల్గొన్న ముగ్గురికి మరణశిక్షను విధించారు. గత ఏడాది నవంబర్లో ఇస్ఫాహన్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనతో లింకు ఉన్నట్లు ఆ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కాల్పుల్లో ముగ్గురు సెక్యూర్టీ సిబ్బంది చనిపోయారు.
అయితే ఉరి తీసిన ముగ్గురిపై సరైన రీతిలో విచారణ జరగలేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొన్నది. విచారణ పేరుతో వాళ్లను చిత్రహింస పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి మరో నలుగురు నిరసనకారుల్ని ఇరాన్ ఉరి తీసిన విషయం తెలిసిందే.
హిజాబ్ ధరించలేదని 22 ఏళ్ల మాషా అమినిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. ఆ కుర్దిష్ మహిళ మృతిని ఖండిస్తూ.. గత సెప్టెంబర్లో ఇరాన్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి.
మజిద్ ఖజేమి, సలేహ్ మిర్హషమీ, సయ్యిద్ యాకూబీలను ఇవాళ ఉరి తీశారు.