హేగ్: ఉక్రెయిన్పై దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) రష్యాను ఆదేశించింది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్ చేసిన ఫిర్యాదుపై నెదర్లాండ్స్ హేగ్లోని ప్రపంచ కోర్టు ఈ మేరకు బుధవారం పిలుపునిచ్చింది. కాగా, ఐసీజే ఆదేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాపై తాము వేసిన కేసులో ఉక్రెయిన్ పూర్తి విజయాన్ని సాధించిందని తెలిపారు. దురాక్రమణను వెంటనే నిలిపివేయాలని ఐసీజే ఆదేశించిందని చెప్పారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి ఈ ఆదేశం ఉందన్నారు. రష్యా వెంటనే దీనికి కట్టుబడాలని సూచించారు. ఒకవేళ ఐసీజే ఆదేశాన్ని రష్యా విస్మరిస్తే ఆ దేశం మరింత ఏకాకి అవుతుందని హెచ్చరించారు.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించినట్లు తెలుస్తున్నది. యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాలు తాత్కాలిక శాంతి ప్రణాళికను రూపొందించాయని ది కైవ్ ఇండిపెండెంట్ అనే వార్తా సంస్థ తెలిపింది. నాటోలో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ కోరకపోతే, స్విడన్ తరహాలో సైనిక దళాలపై పరిమితులకు ఆ దేశం అంగీకరిస్తే కాల్పులను విరమించడంతోపాటు ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను వెనక్కి మళ్లించడం వంటి ఒప్పందాలు ఈ శాంతి ప్రణాళికలో ఉన్నట్లు పేర్కొంది.