ఖాట్మండు: నేపాల్ పురుషుల క్రికెట్ జట్టు హెచ్కోచ్గా భారత్కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ నియమితులయ్యారు. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఆయన నేపాల్ క్రికెట్ టీమ్కు శిక్షణ ఇస్తున్నారు. ఇవాళ అధికారికంగా ఆయనను టీమ్ హెడ్కోచ్గా ప్రకటించారు.
నేపాల్ యువజన, క్రీడా మంత్రిత్వ శాఖతో సంప్రతింపుల అనంతరం క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) మెన్స్ టీమ్ హెడ్కోచ్గా మాంటీ దేశాయ్ పేరును ఖరారు చేసింది. CAN నిర్ణయానికి నేపాల్ జాతీయ క్రీడా మండలి ఆమోదం తెలిపింది. మాంటీ దేశాయ్ గతంలో వెస్టిండీస్ మెన్స్ టీమ్ బ్యాటింగ్ కోచ్గా పనిచేశారు.