లండన్, ఫిబ్రవరి 15: ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లటానికి భారతీయులు ప్రస్తుతం ఆసక్తి కనబర్చటం లేదు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్కు ఉన్నత చదువుల కోసం వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 0.7 శాతం పెరిగినా.. కేవలం ఇండియా, నైజీరియా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే భారత్ నుంచి వచ్చే దరఖాస్తుల్లో 4 శాతం తగ్గుముఖం కనిపించింది. నైజీరియా నుంచి వచ్చే దరఖాస్తుల్లో 46 శాతం తగ్గుదల నమోదైంది. పోస్ట్ స్టడీ వర్క్ వీసాపై ఆంక్షలు, విద్యార్థులు తమ వెంట కుటుంబసభ్యులను తీసుకురావడంపై ప్రభుత్వం నియంత్రణ విధించడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.