లండన్: ఉన్నత విద్య కోసం బ్రిటన్ యూనివర్సిటీలను ఎంపిక చేసుకునే భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది. యూకే హోం ఆఫీస్ గురువారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో 16 శాతం తగ్గింది. నికర వలసలు 10 శాతం తగ్గాయి. అయితే స్టూడెంట్ వీసాలపై వచ్చే విదేశీ విద్యారులు చెల్లించే ఫీజులపై ఆధారపడే బ్రిటిష్ విశ్వవిద్యాలయాలు ఈ పరిణామాల పట్ల ఆందోళనకు గురవుతున్నాయి.