Indian student| మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత్కు చెందిన 23 ఏండ్ల విద్యార్థిపై ఖలిస్థాన్ మద్దతుదారులు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఖలిస్థాన్ చర్యలను వ్యతిరేకించినందుకు ఈ దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ విద్యార్థి కారు డ్రైవర్గా పనిచేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. శుక్రవారం కారు తీస్తుండగా, నలుగురు ఖలిస్థాన్ మద్దతుదారులు తనను అడ్డుకొని దాడికి దిగారిని బాధితుడు తెలిపాడు. ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని చెప్పాడు. బాధితుడి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఆస్ట్రేలియా, కెనడాతోపాటు పలు దేశాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.