లండన్: బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేశారు ఎంపీ శివానీ రాజా(MP Shivani Raja). భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల ఆ మహిళ.. లీసెస్టర్ ఈస్ట్ స్థానం నుంచి పార్లమెంట్కు ఇటీవల ఎంపికయ్యారు. లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్పై ఆమె విజయం సాధించారు. లీసెస్టర్ ఈస్ట్ స్థానం వాస్తవానికి లేబర్ పార్టీకి కీలకమైంది. కానీ 37 ఏళ్లలో తొలిసారి టోరీ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నది.
ప్రమాణ స్వీకారం వేళ బ్రిటీష్ పార్లమెంట్లో ఎంపీ శివానీ.. భగవద్గీతపై ప్రమాణం చేశారు. లీసెస్టర్ ఈస్ట్కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పిన ఆమె.. బ్రిటన్ చక్రవర్తి ఆదేశాల ప్రకారం నడుచుకోనున్నట్లు ఆమె గీతపై ప్రమాణం చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్లో ఆమె ఓ పోస్టు కూడా చేశారు.
జూలై 4వ తేదీన జరిగిన ఎన్నికల్లో హౌజ్ ఆఫ్ కామన్స్ తరపున ఎంపీ శివానీ రాజా ఎన్నికయ్యారు. మొత్తం 27 మంది భారతీయ సంతతి ఎంపీలు హౌజ్ ఆఫ్ కామన్స్లో ఉన్నారు. శివానీ రాజా .. గుజరాతీ మూలాలు ఉన్న వ్యక్తి. ఆమెది డయూ. 1970 దశకంలో ఆమె పేరెంట్స్ కెన్యా నుంచి లీసెస్టర్కు వలసవెళ్లారు. డీ మాంట్ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి ఫార్మసీ, కాస్మటిక్ సైన్స్ పూర్తి చేసిందామె. ఇంగ్లండ్లోని అనేక కాస్మటిక్స్ బ్రాండ్స్ కంపెనీల్లో చేసింది.
It was an honour to be sworn into Parliament today to represent Leicester East.
I was truly proud to swear my allegiance to His Majesty King Charles on the Gita.#LeicesterEast pic.twitter.com/l7hogSSE2C
— Shivani Raja MP (@ShivaniRaja_LE) July 10, 2024