బెర్లిన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ బెర్లిన్ చేరుకున్నారు. బ్రాండన్బర్గ్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. హోటల్ అలన్ కెంపిన్స్కీలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు ప్రధాని మోదీతో ముచ్చటించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆయన మాట్లాడారు. ఓ అమ్మాయి ప్రధానికి చిత్రపటాన్ని బహూకరించింది. ప్రధాని తనకు ఆదర్శమని ఆమె బాలిక తెలిపింది. ఓ బాలుడు దేభక్తి పాటను ఆలకించాడు. మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్రధాని మోదీ చిటికలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలిడుని మోదీ మెచ్చుకున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్తో ప్రధాని ఇవాళ భేటీ కానున్నారు. ఆ తర్వాత డెన్మార్క్, ఫ్రాన్స్లను కూడా ఆయన విజిట్ చేస్తారు.
#WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm
— ANI (@ANI) May 2, 2022