న్యూయార్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించారు. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. 23 ఏండ్ల భారతీయ అమెరికన్ నబీలా సయ్యద్.. ఇల్లినాయిస్ 51వ డిస్ట్రిక్ నుంచి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన క్రిస్ బాస్పై ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నబీలాకు 52.3 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తమన ఆనందాన్ని పంచుకున్నారు.
‘నాపేరు నబీలా సయ్యద్. నాకు 23 ఏండ్లు. ఇండో-అమెరికన్ ముస్లిం మహిళని. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించింది. దీంతో ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైనవారిలో నేనే పిన్న వయస్కురాలిని. తనకు మద్దతిచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు’ అని నబీలా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
My name is Nabeela Syed. I’m a 23-year old Muslim, Indian-American woman. We just flipped a Republican-held suburban district.
And in January, I’ll be the youngest member of the Illinois General Assembly.
— Nabeela Syed (@NabeelaforIL) November 9, 2022
Thank you thread incoming tomorrow. We had an incredible team that made this possible. 💙
— Nabeela Syed (@NabeelaforIL) November 9, 2022
ఇదే ఎన్నికల్లో ఇల్లినాయిస్ జిల్లాలో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి (49) రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి క్రిస్ డర్గిస్ను మట్టికరిపించారు. ఆయన ప్రతినిధుల సంభకు ఎన్నికవడం ఇది వరుసగా నాలుగోసారి. ఇక హైదరాబాద్కు చెందిన అరుణా మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఎన్నికై సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలసిందే. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. గవర్నర్ తర్వాత అత్యున్నత హోదా లెఫ్టినెంట్ గవర్నర్దే. ఒకవేళ గవర్నర్ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేకపోతే ఆ బాధ్యతలను లెఫ్ట్నెంట్ గవర్నర్కు అప్పగిస్తారు.