మిస్ ఇండియా యూఎస్ఏ-2023గా రిజుల్ మైనీ నిలిచారు. న్యూజెర్సీలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అందాల కిరీటం తొడిగారు. భారత సంతతికి చెందిన 24 ఏండ్ల మైనీ మిషిగన్ వర్సిటీ మెడికల్ విద్యార్థిని. మోడల్ కూడా. వర్జీనియాకు చెందిన గ్రీష్మాభట్ రెండోస్థానంలో, నార్త్ కరోలినాకు చెందిన ఇషితా పాయి రాయికర్ మూడోస్థానంలో నిలిచారు. మిస్ ఇండియా యూఎస్ఏ, మిస్టర్ ఇండియా యూఎస్ఏ, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ ఇలా మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీలకు 25 రాష్ర్టాల నుంచి 57 మంది అభ్యర్థులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.