వాషింగ్టన్, డిసెంబర్ 4: ప్రముఖ ఇండో అమెరికన్ గణిత వేత్త, ప్రొఫెసర్ నిఖిల్ శ్రీవాస్తవ సిప్రియాన్ ఫోయస్ ప్రైజ్కు ఎంపికయ్యారు. ఆపరేటర్ థియరీలో పాలినామియల్ మాత్రిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి పద్ధతులను అభివృద్ధి చేసినందుకు గాను అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ(ఏఎంఎస్) నిఖిల్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇదే అంశంలో నిఖిల్తో పాటు మరో ఇద్దరు ఆడమ్ మార్కస్, డేనియల్ స్పీల్మ్యాన్ కూడా సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆపరేటర్ థియరీలో వీరు అభివృద్ధి చేసిన పద్ధతులతో 1959 నాటి రిచర్డ్ కేడిసన్-ఐసడోర్ సింగర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏఎంఎస్ పేర్కొన్నది. వచ్చే ఏడాది జనవరి 5న సియాటెల్లో జరిగే జాయింట్ మ్యాథమెటిక్స్ మీటింగ్ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నిఖిల్ 2014లో జార్జ్ పోల్యా, ఈ ఏడాది హెల్డ్ ప్రైజ్ను గెలుచుకొన్నారు. ప్రస్తుతం ఆయన కాలిఫోర్నియా వర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. సిప్రియాన్ ఫోయస్ అవార్డును ఏఎంఎస్ ఈ ఏడాదే ప్రారంభించడం విశేషం.