వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవకు అరుదైన అవార్డు దక్కింది. 1959 నాటి గణితశాస్త్ర సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న నేపథ్యంలో నిఖిల్ శ్రీవాస్తవకు సిప్రియాన్ ఫోయాస్ ప్రైజ్కు ఎంపికయ్యారు. ఆపరేటర్ థియేరీలో అమెరికన్ మాథ్యమటికల్ సొసైటీ ఈ అవార్డును ఇచ్చింది. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిఖిల్ శ్రీవాస్తవ బోధన వృత్తిలో ఉన్నారు. సిప్రియాన్ అవార్డును గెలిచినవారిలో నిఖిల్తో పాటు ఆడమ్ మార్కస్, డానియల్ స్పిల్మ్యాన్లు ఉన్నారు. ముగ్గురికి కలిసి ఈ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు. గణితశాస్త్రంలో నిఖిల్ శ్రీవాస్తవ ప్రైజ్లు గెలవడం చాలా కామన్. ఆ రంగంలో ఆయనకు ఇది మూడవ అతిపెద్ద అవార్డు. గతంలో 2014లో జార్జ్ పోలియా ప్రైజ్, 2021లో హెల్డ్ ప్రైజ్లను కూడా నిఖిల్ గెలుచుకున్నాడు. ఆపరేటర్ థియరీలో రిచర్డ్ కడిసన్, ఇసడోర్ సింగర్లు 1959లో విసిరిన ప్రశ్నకు నిఖిల్ పరిష్కారాన్ని కనుగొన్నాడు.