న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతున్నది. చాలా రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో శుక్రవారం అత్యధికంగా 14,859 కరోనా కేసులు, 78 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,24,509కు, మరణాల సంఖ్య 13,190కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 10,03,985 మంది కోలుకోగా ప్రస్తుతం 1,07,315 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు కేరళలో శుక్రవారం రికార్డుస్థాయిలో 10,031 కరోనా కేసులు, 21 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్ తర్వాత ఆ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల నమోదు పది వేలు దాటడం ఇదే తొలిసారి. కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 లక్షలు, మరణాలు 4,800 దాటాయి.