ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో(Pakistan Elections) అనూహ్య ఫలితాలు వెలుబడే అవకాశాలు ఉన్నాయి. జైలుశిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న స్వతంత్య్ర అభ్యర్థులు లీడింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్లు ఆశ్చర్యకరమైన రీతిలో దూసుకెళ్తున్నారని స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇమ్రాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ కొన్ని చోట్ల పోటీ చేయలేదు. కానీ ఆ పార్టీ మద్దతు ఇచ్చిన స్వతంత్రులు లీడింగ్లో ఉన్నారు. ఇప్పటి వరకు పాక్ ఎన్నికల సంఘం 13 ఫలితాలను వెల్లడించింది. దాంట్లో ఇమ్రాన్ మద్దతుదారులు అయిదు చోట్ల నెగ్గారు. నవాజ్ షరీఫ్ పార్టీ నాలుగు స్థానాల్లో, పీపీపీ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది.
దేశవ్యాప్తంగా మొత్తం 266 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాంట్లో 134 సీట్లు సాధించిన పార్టీ.. పాక్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 60 సీట్లు మహిళలకు, పది సీట్లు మైనార్టీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి. ఇక పంజాబ్ అసెంబ్లీలో 296, సింధ్ అసెంబ్లీలో 130, ఖైబర్ ఫక్తున్కాలో 113 స్థానాలకు, బలోచిస్తాన్లో 51 స్థానాలకు ఫలితాలు రావాల్సి ఉంది.