షాంఘై: చైనాలోని షాంఘై నగరంలో కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని వారాల నుంచి షాంఘైలోని ప్రజలు దాదాపు క్వారెంటైన్కే పరిమితం అయ్యారు. అయితే నెగటివ్ ఫలితం వచ్చిన వాళ్లను కూడా నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన పాక్షిక నివాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. షాంఘైలో దాదాపు 2.5 కోట్ల జనాభా ఉంది. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఇంట్లో కాకుండా పాక్షిక క్వారెంటైన్ కేంద్రాలకు తరలిన్నారు.
అయితే నెగటివ్ టెస్ట్ వచ్చిన వారిని కూడా ఆ క్వారెంటైన్ సెంటర్లకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కాంపౌండ్లో ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాల నుంచి నెగటివ్ ఫలితం వచ్చినవాళ్లను కూడా ప్రత్యేక క్వారెంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారని, ఎందుకంటే వైరస్ సోకకుండా ఉండేందుకు అని కొందరు చెప్పారు. వైరస్ నెగటివ్ గ్రూపులను వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన సింగిల్ ప్రీఫాబ్ క్యాబిన్లకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ షాంఘైలో కొత్తగా ఏడు వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 32 మంది వైరస్తో మృతిచెందారు. జీరో కోవిడ్ విధానంలో భాగంగా షాంఘైలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.