అవిశ్వాస తీర్మానంపై చర్చకు కొద్ది గంటల ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే.. తాను పార్లమెంట్ను రద్దు చేస్తానని ప్రతిపక్షాలకు ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని ఇమ్రాన్ కోటరీలోని ఓ కీలక వ్యక్తి ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్కు చేరవేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతలు ఓ చోట సమావేశమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పాక్లో రాజకీయ సంక్షోభం తలెత్తిందని, దీనికి విరుగుడు ఇదేనని ఇమ్రాన్ సందేశం పంపారు. ఒకవేళ తాను పంపిన ప్రతిపాదనకు ప్రతిపక్షాలకు అంగీకరించని పక్షంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను రెడీగా ఉన్నానని ఇమ్రాన్ తేల్చి చెప్పారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారశాఖ మంత్రి ఫవద్ చౌదరీ తెలిపారు. ప్రధాని నివాసంలోనే ఆ మీటింగ్ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా అంశాలను ఎన్ఎస్సీ కోఆర్డినేట్ చేస్తున్నది. ప్రధాని ఇమ్రాన్తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు ఈ మీటింగ్లో పాల్గొనున్నారు.