Imran Khan | పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రామా చేస్తున్నారని పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎమ్) చీఫ్ మౌలానా ఫజ్లర్ రెహ్మాన్ అన్నారు. వజీరాబాద్ ఇమ్రాన్పై జరిగిన దాడిని ఆయన ఓ డ్రామాగా అభివర్ణించారు. ‘వజీరాబాద్ ఘటన తర్వాత ఇమ్రాన్పై సానుభూతి కలిగింది. ఇప్పుడు అదంతా డ్రామాగా అనిపిస్తోంది. ఇమ్రాన్ నటనలో బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ను మించిపోయారు. ఇమ్రాన్పై ఎన్ని తూటాలు కాల్చారు..? ఎన్నిచోట్ల గాయాలయ్యాయి..? దాడి జరిగిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి కాకుండా లాహోర్కు తీసుకెళ్లడం ఆశ్చర్యంకలిగిస్తోంది’ అని మౌలానా ఫజ్లర్ రెహ్మాన్ అన్నారు.
దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్తో పాక్ పంజాబ్లోని వజీరాబాద్ అల్లావాలాచౌక్లో ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసింగించేందుకు ఇమ్రాన్ కంటెయినర్పైకి ఎక్కి నిలబడిన సమయంలో.. ఓ దుండగుడు ఇమ్రాన్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని వెంటనే లాహోర్లోని ఆసుపత్రికి తరలించి చిక్సిత అందించారు. శస్త్రచికిత్స అనంతరం ఆదివారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి లాహోర్లోని నివాసానికి వెళ్లారు.