న్యూయార్క్, ఆగస్టు 15: విశ్వాంతరాళంలో ఎక్కడో ఒక చోట గ్రహాంతర వాసులు (ఏలియన్స్) ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. అయితే, ఒకవేళ ఏలియన్స్ భూమి మీదకు వస్తే మనుషులకు ప్రమాదమేనని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మనుషుల కంటే ఏలియన్స్ దగ్గర గొప్ప సాంకేతికత ఉండొచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. స్పేస్షిప్ల సాయంతో వాళ్లు ఒక నక్షత్ర మండలం నుంచి మరో నక్షత్ర మండలానికి సులభంగా వెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చన్నారు. ఇదే జరిగితే, మనుషులు చిక్కుల్లో పడ్డట్లేనని, ఏలియన్స్ దయతోనే మనం బతుకీడ్చాల్సిందేనన్నారు. అయితే, ఏలియన్స్ ఉనికిపై తనకు ఇంతవరకైతే సమాచారం లేదన్నారు.