Taliban in Panjshir | పంజ్షేర్ను వదిలి తానెక్కడికి పోలేదని ఆఫ్ఘనిస్థాన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లబోనని స్పష్టం చేశారు. తాలిబన్ల అంతు తేలుస్తానని శుక్రవారం రాత్రి తేల్చి చెప్పినట్లు సమాచారం. పంజ్షేర్పై పట్టు సాధించామని తాలిబన్లు ప్రకటించారని, కానీ ఒక్క అంగుళం కూడా వారు స్వాధీనం చేసుకోలేదని ఆయన సారధ్యంలోని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది.
అంతకుముందు గురువారం రెండు విమానాల్లో అమ్రుల్లా సలేహ్ తజికిస్థాన్కు పారిపోయారని వార్తలొచ్చాయి. తాలిబన్ల సెగ పెరుగుతున్న నేపథ్యంలో పంజ్షీర్ కమాండర్లతో కలిసి దేశాన్ని వీడినట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
తాలిబాన్లకు వ్యతిరేకంగా పంజ్షీర్లోని ప్రతిఘటన దళాలు ఆఫ్ఘన్ పౌరుల హక్కులను కాపాడుతాయని పేర్కొన్నాయి. ఆ మరుసటి రోజు సాలేహ్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. దేశం నుంచి వీడాక శుక్రవారం ఓ ట్వీట్లో పంజ్షేర్ ప్రజల బాధాకరమైన అనుభవాలను హైలైట్ చేశారు.
‘తాలిబ్లు పంజ్షీర్కి మానవతా సహాయాన్ని నిరోధించారు. పంజ్షీర్ సైనిక వృద్ధులను మైన్ క్లియరెన్స్కు వినియోగించుకున్నారు. ఫోన్, విద్యుత్ సౌకర్యాలను నిలిపివేశారు. ఔషధాలను కూడా అనుమతించడం లేదు. ప్రజలు కొంత మొత్తంలో మాత్రమే నగదు తీసుకెళ్లగలుగుతున్నారు’ అని పేర్కొన్నారు.