లండన్: కరోనాతో సెకండ్ వేవ్తో అల్లాడుతున్న భారత్కు ప్రాణాలను కాపాడే వైద్య సామగ్రిని పంపుతున్నట్లు బ్రిటన్ తెలిపింది. 9 కంటైనర్లలో వందలాది ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, వెంటిలేటర్లు పంపినట్లు పేర్కొంది. 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 120 నాన్-ఇన్వాసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లు మంగళవారం నాటికి భారత్ చేరుకుంటాయని, మరో వారంలో మరికొన్ని అందుతాయని వెల్లడించింది.
“ఈ భయంకరమైన వైరస్ వల్ల విషాదకరమైన ప్రాణనష్టం జరగకుండా చేసే ప్రయత్నాలకు మద్దతుగా వందలాది ఆక్సిజన్ సాంద్రతలు, వెంటిలేటర్లతో సహా కీలకమైన వైద్య పరికరాలు బ్రిటన్ నుండి భారతదేశానికి వెళ్తున్నాయి” అని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాపై పోరాటంలో స్నేహితుడిగాను, భాగస్వామ్య దేశంగాను భారత్ వెన్నంట ఉంటామని చెప్పారు.
మహమ్మారిపై ప్రపంచవ్యాప్త పోరాటంలో అవసరమైన మద్దతను అంతర్జాతీయ సమాజానికి ఇవ్వడానికి బ్రిటన్ నిశ్చయంతో ఉన్నదని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కాగా, భారత్లో సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నెలలో ఆయన చేపట్టాల్సిన పర్యటన రద్దయ్యింది.