Viral Video | పిల్లులు, కుక్కలు, కుందేళ్లను పెంచుకోవడం చూశాం. కానీ కొందరు సరీసృపాలను ఇంట్లోనే పెంచుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. కానీ ఆ సరీసృపాలు తమ యజమానులపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి పెంచుకుంటున్న కొండచిలువ కూడా తన విశ్వరూపం ప్రదర్శించింది. యజమాని ముఖంపై దాడి చేసి పీక్కుతింది. తీవ్రంగా గాయపరిచింది.
కేజ్లో ఉన్న కొండచిలువకు ఆహారం పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా, అది క్షణాల్లో యజమానిపై దాడి చేసింది. ఏకంగా ముఖాన్ని అదిమిపట్టుకుని దాడి చేసింది. ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు అప్రమత్తమై కొండచిలువను తప్పించేందుకు యత్నించారు. కానీ అది గట్టిగా ముఖాన్ని పట్టుకోవడంతో సాధ్యం కాలేదు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఈ వీడియోను 8 వేల మంది లైక్ చేశారు. 20 వేల మంది వీక్షించారు. సరీసృపాలు, జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. మూగజీవులను హింసిస్తే తగిన శాస్తి జరుగుతుందని పేర్కొన్నారు.