హాంగ్కాంగ్: కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో హాంగ్కాంగ్లో గత కొన్ని నెలలుగా కరోనా నిబంధనలు కఠినంగా అమలుచేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక నుంచి ఆ నిబంధననను ఎత్తివేయనున్నట్లు ఇవాళ ఉదయం హాంగ్కాంగ్ ప్రభుత్వం ప్రకటించింది.
అదేవిధంగా హాంగ్కాంగ్ నగరంలో ప్రవేశించి, వివిధ ప్రదేశాలను సందర్శించాలంటే సదరు వ్యక్తి దగ్గర తప్పనిసరిగా సిటీ పాస్ ఉండాలి. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే ఈ సిటీ పాస్ ఇచ్చేవారు. అయితే ఇకపై ఈ సిటీ పాస్ నిబంధనను కూడా ఎత్తివేయనున్నట్లు హాంగ్కాంగ్ ప్రభుత్వం తెలిపింది.
ఈ నిబంధనల ఎత్తివేతకు సంబంధించి హాంగ్కాంగ్ నాయకుడు జాన్ లీ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకటన చేసే అవకాశం ఉన్నది. కాగా రెండు రోజుల క్రితం జాన్ లీ చైనా మెయిన్ లాండ్తో తమ సరిహద్దులను తిరిగి తెరుస్తామని చెప్పారు. జనవరి 8 నుంచి దేశీయ ప్రయాణికులకు కరోనా క్వారెంటైన్ నిబంధనను ఎత్తివేయనున్నట్లు చైనా కూడా ఇటీవలే ప్రకటించింది.