హాంగ్కాంగ్: రగ్బీ మ్యాచ్ సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకున్నది. హాంగ్కాంగ్, దక్షిణ కొరియా మధ్య జరిగిన రగ్బీ మ్యాచ్కు ముందు జాతీయ గీతాలను ఆలపించారు. అయితే హాంగ్ కాంగ్ ప్లేయర్ల తరపున చైనా జాతీయ గీతాన్ని ప్లే చేయాల్సి ఉంది. కానీ దానికి బదులుగా 2019లో హాంగ్ కాంగ్లో నిరసనలు జరిగిన సయమంలో పాపులర్ అయిన సాంగ్ను ప్లే చేశారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన హాంగ్ కాంగ్ ప్రభుత్వం విచారణకు డిమాండ్ చేసింది.
ఏషియా రగ్బీ సెవన్స్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఇరు దేశాల ప్లేయర్లు జాతీయ గీతాలాపన కోసం నిలుచున్న సమయంలో ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు గ్లోరీ టు హాంగ్ కాంగ్ పాటకు చెందిన ఇన్స్ట్రమెంటల్ వర్షన్ను ప్లే చేశారు. గ్లోరీ టు హాంగ్ కాంగ్ సాంగ్.. 2019 నిరసనల సమయంలో మారుమోగింది. ఈ ఘటనపట్ల ఏషియా రగ్బీ క్షమాపణలు చెప్పింది. మానవ తప్పిదం వల్ల అలా జరిగినట్లు తెలిపింది.