న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి మే 3 వరకు భారత్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ రద్దు చేసింది. ఈ తేదీల్లో పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బయల్దేరే విమానాలపై కూడా నిషేధం విధించింది. ఈ నెలలో రెండు విస్తారా విమానాల్లో ప్రయాణించిన 50 మంది ప్రయాణికులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. ముంబై – హాంకాంగ్ మార్గంలో వెళ్లే విస్తారా విమానాలను మే 3 వరకు నిషేధించింది.