వాషింగ్టన్, డిసెంబర్ 4: వాతావరణ మార్పులు, భూతాపం వృద్ధుల గుండెకు చేటు చేస్తున్నట్టు జపాన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలో అనూహ్య పెరుగుదల వల్ల వృద్ధులు ఎక్కువగా గుండెపోటు బారినపడుతున్నారని, చాలామంది మృతి చెందుతున్నట్టు గుర్తించారు. 65 ఏండ్లు పైబడిన 3,367 మందిపై అధ్యయనం నిర్వహించారు.
వీరంతా 2012-2019 వరకు వర్షాకాలం ముగిసిన కొన్ని నెలల తర్వాత గుండెపోటుతో దవాఖానలో చేరారు. వారు ఏ రోజున ఎంత ఉష్ణోగ్రతలో నివసించారనే డాటాను పరిశోధకులు నమోదు చేశారు. వర్షాకాలం తర్వాత పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల వృద్ధుల్లో గుండెపోటు సంభవిస్తున్నదని గుర్తించారు. ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినా గుండెపోటు ముప్పు 35% పెరుగుతున్నట్టు తేల్చారు.