న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఐదేండ్ల క్రితం విదేశాల్లో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని రోగం ‘హవానా సిండ్రోవ్ు’ తొలి కేసు భారత్లో నమోదైంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ విలియవ్ు బర్న్స్తో కలిసి భారత్లో ఈ నెల మొదట్లో పర్యటించిన అధికారి ఒకరిలో హవానా సిండ్రోవ్ు లక్షణాలు కనిపించినట్టు అమెరికా వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆ బాధిత వ్యక్తి చికిత్స పొందాల్సి ఉన్నదని పేర్కొన్నాయి.
ఏమిటీ ‘హవానా సిండ్రోవ్ు’?
క్యూబా రాజధాని హవానా నగరంలో 2016లో తొలిసారిగా ఈ వ్యాధిని గుర్తించారు. ఆ నగరం పేరుమీదుగా దీన్ని ‘హవానా సిండ్రోవ్ు’గా పిలుస్తున్నారు. క్యూబాలోని ఓ హోటల్ గదుల్లో దిగిన అమెరికా దౌత్యవేత్తలు ఉన్నట్టుండి కొంత అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నిమిషాల్లోనే.. వారిలో వికారం, తీవ్రమైన తలనొప్పి, అలసట, నిద్ర సమస్యలు, మైకం, వినికిడి లోపం, ఒళ్లు నొప్పులు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. గదుల్లోపల వింత శబ్దాలు విన్న అనంతరం బాధితుల్లో ఈ సమస్యలు తలెత్తినట్టు వైద్యులు ప్రాథమికంగా అంచనా వేశారు. గత ఐదేండ్లలో దాదాపు 200 మంది అమెరికా దౌత్య సిబ్బంది, గూఢచారులు, వారి కుటుంబ సభ్యుల్లో ఈ సిండ్రోవ్ు లక్షణాలు గుర్తించినట్లు చెప్పారు.
ఎందుకు ఇలా జరుగుతుంది?
‘హవానా సిండ్రోవ్ు’ రావడానికి గల కారణాలను ఇప్పటికీ వైద్యులు, శాస్త్రవేత్తలు కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. అయితే, మైక్రోవేవ్ తరంగాలు ప్రసారం కావడం వల్ల అవి బాధితుల మెదడుపై ప్రభావం చూపి ఈ సిండ్రోమ్ తలెత్తుతున్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్ఏఎస్) ఓ నివేదికలో అనుమానం వ్యక్తం చేసింది. అయితే, విదేశీ వ్యవహారాల విభాగం ఒత్తిడితో కూడుకున్నదని.. అందుకే ఈ మానసిక సమస్యలు కనిపిస్తున్నట్టు మరికొందరు చెబుతున్నారు.