POK- UK High Commissioner | `పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)`లో ఇస్లామాబాద్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటనపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. `భారత్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం ఆమోదయోగ్యం కాదు. ఎల్లవేళలా భారత్లో జమ్ముకశ్మీర్ సమగ్ర భాగం` అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నొక్కి చెప్పింది. పీఓకేలో పాక్లో బ్రిటన్ హైకమిషనర్ జాన్ మారియట్ పర్యటనపై శుక్రవారం స్పందించింది. `ఇస్లామాబాద్లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ పీవోకేలో పర్యటించడం అత్యంత అభ్యంతరకరం. దీన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. బ్రిటన్ విదేశాంగశాఖ అధికారితో కలిసి పీవోకేలో ఈ నెల 10న పర్యటించారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశికత సమగ్రతను ఉల్లంఘించడం ఎంత మాత్రమూ సమంజసం కాదు` అని పేర్కొన్నారు.
దీనిపై భారత్ల బ్రిటన్ హై కమిషనర్ను పిలిపించి విదేశాంగశాఖ కార్యదర్శి తీవ్ర నిరసన తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము అండ్ కశ్మీర్, లడఖ్ ఎల్లవేళలా భారత్లో అంతర్భాగమే` అని విదేశాంగశాఖ తెలిపారు.
పాకిస్థాన్లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ ఈ నెల 10న పీవోకేలో కేంద్ర స్థానమైన మిర్పూర్ను సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను `ఎక్స్`లో పోస్ట్ చేశారు. `బ్రిటన్, పాకిస్థాన్ పౌరుల మధ్య సంబంధాలకు గుండెకాయ మిర్పూర్కు సలాం. 70 శాతం బ్రిటన్ పాకిస్థానీయుల మూలాలూ మిర్పూర్ నుంచే వచ్చాయి. ప్రవాసుల ప్రయోజనాల కోసం మమ్ముల్ని కలిసి పని చేసేలా చేస్తోంది. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు` అంటూ పోస్ట్ పెట్టారు. జాన్ మారియట్ పీఓకే పర్యటనపై పాక్లో బ్రిటన్ హైకమిషనర్ ట్విట్టర్ హ్యాండిల్..వీడియోను పోస్ట్ చేసింది. మిర్పూర్ పర్యటనలో భాగంగా స్థానికులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన జాన్ మారియట్.. బేకరిలోకి వెళ్లారు. స్థానిక జిల్లా అధికారులతో చర్చించారు.