సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఘోర విషాదం చోటుచేసుకున్నది. హాలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 151కి పెరిగింది. మరో 150 మందికిపైగా గాయపడ్డారు. వేడుకల్లో భాగంగా సియోల్లోని ఇటావోన్ ప్రాంతంలో ఇరుకైన వీధి గుండా వేలాది మంది ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. కాగా, మృతులు, గాయపడినవారిలో ఎక్కువగా 20 ఏండ్ల లోపు వయస్సున్న యువతే ఉన్నారని అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారని, మరో 15 మంది ఇతర దేశాలకు చెందినవారు గాయపడ్డారని తెలిపారు.
సమీపంలో ఉన్న బార్కు వచ్చిన సినీ సినీతారను చూసేందుకు జనం పరుగులు తీయడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కరోనా ఆంక్షాలను తొలగించిన తర్వాత తొలిసారిగా హాలోవీన్ వేడుకలు జరుగుతుండటంతో దాదాపు లక్ష మంది ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఘటనపై దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
충격주의)이태원 길거리에 덮어진 모포
저 사람들이 다 심정지된 상태고 병원에 가면 사망선고 받는 거임… pic.twitter.com/UXgN9UCPUS
— 이것저것 소식들 (@feedforyou11) October 29, 2022