న్యూయార్క్: ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా నేత హఫీజ్ సయ్యిద్(Hafiz Saeed) ప్రస్తుతం పాకిస్థాన్ కస్టడీలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉగ్రవాది హఫీజ్కు పాక్లో 78 ఏళ్ల జైలుశిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో అతను ఆ శిక్షను అనుభవిస్తున్నట్లు యూఎన్ తెలిపింది. 73 ఏళ్ల హఫీజ్ సయ్యిద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2008లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. 2020, ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఆయన శిక్షా కాలాన్ని అనుభవిస్తున్నట్లు యూన్ తన వెబ్సైట్లో పోస్టు చేసిన ప్రకటనలో వెల్లడించింది. లాహోర్ జిల్లాలోని లాహోర్ తెహిసిల్లో ఉన్న మొహల్లా జోహర్ అడ్రస్లో సయిద్ ఉన్నట్లు ఆ సైట్లో తెలిపారు. సయ్యిద్ను అప్పగించాలని డిసెంబర్లో పాక్ను ఇండియా కోరిన విషయం తెలిసిందే. 2008 నాటి ముంబై దాడితో పాటు పలు ఉగ్రవాద కేసుల్లో అతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు.