PTI Party | అన్ని రాజకీయ పార్టీలతో సమావేశానికి తేదీ, ప్రదేశాన్ని నిర్ణయించాలని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఫవాద్ చౌదరి మాట్లాడుతూ అన్ని పార్టీలు కలిసి కూర్చొని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ప్రభుత్వం రోజూ ప్రకటనలు చేస్తుందన్న ఫవాద్.. ఇందు కోసం సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటనలు మాని.. ముందుకు సాగాలన్నారు.
చర్చలకు ఇమ్రాన్ఖాన్ సైతం సిద్ధంగా ఉన్నారన్నారు. దేశం కోసం ఎవరితోనైనా మాట్లాడేందుకు, ఏ త్యాగానికైనా సిద్ధమే ఇమ్రాన్ఖాన్ శుక్రవారం ప్రకటించారు. పాకిస్తాన్ అభ్యున్నతి, ప్రజాస్వామ్యం కోసం నేను ఎలాంటి త్యాగాలకైనా వెనుకడుగు వేయనని, ఈ విషయంలో నేను ఎవరితోనైనా మాట్లాడటానికి, ఈ దిశలో ప్రతి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఫవాద్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల కోసం ఇమ్రాన్ ఖాన్ పార్టీని రెండుసార్లు ఆహ్వానించామని, కానీ పార్టీ రాలేదని ఆయన అన్నారు.