న్యూయార్క్, సెప్టెంబర్ 28: వయసు మీద పడ్డ కొద్దీ వేధించే అల్జీమర్స్ వ్యాధిని నయం చేయడంలో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్ను తగ్గించే మాత్రను జపాన్కు చెందిన ఎయ్సాయ్ ఫార్మా కంపెనీ తయారుచేసింది. అల్జీమర్స్ ప్రాథమిక దశలో ఉన్న దాదాపు 1,800 మంది వ్యాధిగ్రస్తులకు ఈ గోలీ అందించి 18 నెలల పరీక్షించగా, 27 శాతం వ్యాధి తీవ్రత తగ్గింది. దీనికి సంబంధించిన పరిశోధన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సదరు కంపెనీ వెల్లడించింది. ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్టు పేర్కొన్నది.