రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలోని పీఏసీఎస్ల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘాల వద్ద రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా విండోల పాలకవర్గ సభ్యులు మొక్కలు నాటారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 9 :ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి సొసైటీ పరిధిలో నిర్వహించిన హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ పాల్గొని మొక్కలు నాటారు. శ్రమదానం చేసి సొసైటీ ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార శాఖ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ రమేశ్, కార్యదర్శి తేజాగౌడ్, క్యాషియర్ రాజన్న, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కోటగిరి మండలంలోని పొతంగల్ విండో ఆవరణలో చైర్మన్, ఎన్డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్ సర్పంచ్ వర్ని శంకర్తో కలిసి మొక్కలు నాటారు.
కోటగిరిలో విండో చైర్మన్ కూచి సిద్దూ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విజయ్కుమార్ పటేల్, మాణికప్ప, గంట్ల విఠల్, సీఈవోలు భరత్కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు విండో ఆధ్వర్యంలో ముమ్మరంగా మొక్కలు నాటారు. వైస్ ఎంపీపీ నవీన్రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేందర్రెడ్డి, నాయకులు సుఖేందర్, ప్రత్యేకాధికారిణి వినోద, టీఏ నాగరాజు, సొసైటీ ఉపాధ్యక్షుడు నర్సారెడ్డి, డైరెక్టర్లు, సీఈవో గంగాధర్, క్లస్టర్ ఆఫీసర్ రమేశ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. దమ్మన్నపేట్ గ్రామంలో సర్పంచ్ కొండ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై మురళి ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.సిరికొండ మండల కేంద్రంలో సొసైటీ వద్ద చైర్మన్ మైలారం గంగారెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. తూంపల్లి గ్రామంలోనూ సొసైటీ ఆవరణలో జడ్పీటీసీ మలావత్ మాన్సింగ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో తూంపల్లి సొసైటీ చైర్మన్ రాములు నాయక్, సర్పంచ్ మల్లేశ్, సంగ్లూనాయక్, ఎంపీటీసీ లింగం, డైరెక్టర్లు కీర్యా, లక్ష్మణ్, పరుశురాం, సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ మండలం మాధవనగర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నగర పరిధిలోని నాల్గో డివిజన్ కార్పొరేటర్ ప్రమోద్కుమార్, సొసైటీ చైర్మన్ నాగేశ్వర్రావు, వైస్చైర్మన్ పోతారెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ బావన్న, సీఈవో వంశీకృష్ణ, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశ్, డైరెక్టర్లు మొక్కలు నాటారు. గుండారం సొసైటీ ఆవరణలో చైర్మన్ శ్రీధర్, సీఈవో అనంతలక్ష్మి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి, డైరెక్టర్లు మొక్కలు నాటారు.
చందూర్ మండలంలోని కారేగాం సహకార సంఘం వద్ద విండో పాలకవర్గ సభ్యులు రైతులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో చైర్మన్ మాధవరెడ్డి, తారాచంద్, సర్పంచులు బొడ్డోల్ల సత్యనారాయణ, దేవీసింగ్, నాయకులు నర్సింహులు, భూమయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
మోర్తాడ్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైస్ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, పీఏసీఎస్ చైర్మన్ కల్లెం అశోక్, వైస్ చైర్మన్ దడివె నవీన్, సర్పంచులు పర్స దేవన్న, వెల్మ రూప, సంతోష్, బోగ ధరణి, గడ్డం చిన్నారెడ్డి, ముత్యాల లక్ష్మణ్, అశోక్, శంకర్, రవీందర్, ఆరిఫ్, మహిపాల్, గంగన్న, రమేశ్, రవి పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించగా.. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రారంభించారు.జక్రాన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అర్గుల్ గ్రామంలో రైతువేదిక వద్ద ఏవో దేవిక మొక్కలు నాటారు. అనంతరం గ్రామసభ నిర్వహించి పల్లెప్రగతి పనులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ముమ్మరంగా ‘పల్లెప్రగతి’
రెంజల్ మండలంలోని కళ్యాపూర్, వీరన్నగుట్ట, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను ఎంపీడీవో గోపాలకృష్ణ పరిశీలించారు. సర్పంచులు రాజు, సాయిలు, విజయ, ఎంపీవో గౌసొద్దీన్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సాయిలు, లింగం, కార్యదర్శులు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని హనుమాన్ఫారం, గాంధీనగర్, లింగాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను డీపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమాన్ఫారం, గాంధీనగర్ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా చేపట్టడంలేదని ఆమె అసహనం వ్యక్తంచేశారు. వెంట కార్యదర్శి రాజగంగు, ఎంపీవో రాజ్కాంత్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు. ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం, జాన్కంపేట్ గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ మొక్కలు నాటారు. వైస్ ఎంపీపీ ఇమ్రాన్ఖాన్, సర్పంచులు విజయ్కమార్, సాయిలు, శేఖర్రాజు, సలీం పాల్గొన్నారు.
బోధన్లో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘం నాయకులు మొక్కలు నాటారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విఠల్రెడ్డి, సూర్యకుమార్, ఈశ్వర్, శక్తివర్దన్, నరేశ్రెడ్డి, ఆదర్శ్, సోను, సుమిత్ పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్లో సర్పంచ్ సాయన్న, గోవింద్పేట్లో సర్పంచ్ గంగాధర్, పిప్రిలో సొసైటీ చైర్మన్ సోమ హేమంత్రెడ్డి, సర్పంచ్ దేవీ, దేగాంలో సర్పంచ్ సరోజ, ఆలూర్లో సర్పంచ్ మోహన్రెడ్డి, అంకాపూర్లో సర్పంచ్ పూజితా, ఫత్తేపూర్లో సర్పంచ్ లక్ష్మి, సుర్బిర్యాల్ సర్పంచ్ సవిత స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. మాక్లూర్ మండలం ముల్లంగి(బీ) గ్రామంలో అధికారులు ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ప్రత్యేకాధికారిణి లత, ఉపాధ్యాయులు, ఐకేపీ వీవో తదితరులు పాల్గొన్నారు.