న్యూఢిల్లీ: ఇటలీలో ప్రఖ్యాతి గాంచిన లీనింగ్ టవర్ శిథిల దశకు చేరకున్నది. ఆ టవర్ ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉన్నది. ఇటలీలోని బొలొగ్నాలో ఉన్న ఆ టవర్ను గారిసెండ టవర్(Garisenda Tower) అని కూడా పిలుస్తారు. దాదాపు వెయ్యి ఏళ్ల నుంచి ఆ టవర్ ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. అయితే ఇటీవల ఆ టవర్ ఎక్కువగా వంగుతోందని, దాని వల్ల ఆ టవర్ కూలే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
150 ఫీట్ల ఎత్తు ఉండే ఆ టవర్ 14వ శతాబ్ధం నుంచి సుమారు 4 డిగ్రీల వంగి ఉంటోంది. ఆ టవర్కు అనేక సార్లు మరమ్మత్తులు చేశారు. పీసా టవర్ తరహాలోనే గారిసెండా టవర్ కూడా వంగుతున్న విషయం తెలిసిందే. పీసా టవర్ మాత్రం 5 డిగ్రీలు వంగి ఉంటుంది.
అకస్మాత్తుగా ఒకేసారి టవర్ పడిపోయే ఛాన్సు ఉందని, ఆ విపత్తు నుంచి తప్పించుకునేందుకు టవర్ చుట్టు మెటల్ కార్డన్ నిర్మించనున్నట్లు అధికారులుత తెలిపారు. ఒకవేళ టవర్ కూలితే నష్టాన్ని తగ్గించేందుకు మెటల్ కార్డన్ను నిర్మిస్తున్నారు.