న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్తో తీవ్ర ఇబ్బంది పడుతున్న భారత్కు అన్నివిధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ అన్నారు.
‘‘కరోనా కేసులు పెరిగి ఇబ్బంది పడుతున్న భారత ప్రజలకు నేను సంఘీభావ సందేశం పంపాలని అనుకుంటున్నా. ఈ కష్టకాలంలో ఫ్రాన్స్ మీకు తోడుగా ఉంటుంది. ఈ మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టదు. మేం అన్నివిధాలా భారత్కు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని మక్రాన్ పేర్కొన్నారు.
ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుయేల్ లెనైన్ తన అధికార ట్విట్టర్లో దేశాధినేత సందేశాన్ని పోస్టు చేశారు. దేశంలో కరోనా రెండో వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
పలు రాష్ట్రాల్లోని దవాఖానల్లో రోగులకు చికిత్స కోసం పడకలు, మెడికల్ ఆక్సిజన్ సైతం లభించడం లేదు.
శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3.32 లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 2263 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి