సింగపూర్: యోగా సెంటర్(Yoga center)లో పనిచేస్తున్న భారతీయ వ్యక్తి తమపై లైంగికంగా వేధింపుల(Molestation)కు పాల్పడినట్లు అయిదుగురు మహిళలు సింగపూర్(Singapore)లో కేసు దాఖలు చేశారు. ట్రస్ట్ యోగా సెంటర్లో పనిచేస్తున్న రాజ్పాల్ సింగ్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. యోగా క్లాసులు తీసుకుంటున్న సమయంలో రాజ్పాల్ ప్రవర్తన సరిగా లేదని 24 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నది. 2020లో జరిగిన ఘటన గురించి తన ఫ్రెండ్కు వాట్సాప్ చేసినట్లు ఆ మహిళ వెల్లడించింది.
2019, ఏప్రిల్ ఒకటో తేదీన ట్రస్ట్ యోగా(Trust Yoga) సెంటర్లో రాజ్పాల్ ఇన్స్ట్రక్టర్గా చేరాడు. తనకు జరిగిన వేధింపుల గురించి ఆ మహిళ ఆ యోగా సెంటర్లో పనిచేస్తున్న అసిస్టెంట్ సేల్స్ మేనేజర్కు కూడా చెప్పినట్లు కోర్టు డాక్యుమెంట్లో పేర్కొన్నారు. అయితే వేధింపులు ఎదురైన ట్విట్టర్లో ఆమె విషయాన్ని చెప్పిన తర్వాత.. మరో ఇద్దరు మహిళలు ఆమెకు జతకూడారు. తనకు ఎదురైన అనుభవం గురించి 28 ఏళ్ల మహిళ తన ఫేస్బుక్(Facebook) అకౌంట్లో రాసింది.
భారతీయ వ్యక్తి రాజ్పాల్(Rajpal Singh)పై దాఖలైన కేసులో కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం నలుగురు మహిళలు వేర్వేరుగా వేధింపుల ఫిర్యాదు చేశారు.