(Today History) ఆసియాలోని ఒక దేశంలో తొలిసారి ఒలింపిక్ క్రీడలను 1964 లో సరిగ్గా ఇదే రోజున నిర్వహించారు. ఈ ఒలింపిక్స్లో పాకిస్తాన్ను ఓడించిన భారత్.. హాకీలో స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టుకున్నది. ఒలింపిక్ క్రీడలు 1964 లో జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు అక్టోబర్ 24 న ముగిశాయి. వాస్తవానికి టోక్యోలో ఒలింపిక్ క్రీడలు 1940 లో నిర్వహించేందుకు ఎంపిక చేశారు. అయితే, జపాన్పై చైనా దాడి చేసిన కారణంగా హెల్సెంకికి మార్చారు. కాగా, 1940, 1944 లలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించలేదు.
టోక్యో ఒలింపిక్స్లో హిరోషిమాలో జన్మించిన యోషినోరి సకాయ్ క్రీడల జ్యోతిని వెలిగించాడు. టోక్యో ఒలింపిక్స్ అమెరికా, ఐరోపాలో శాటిలైట్ ద్వారా ప్రసారం చేసిన మొదటి ఒలింపిక్స్గా చరిత్రలో నిలిచిపోయాయి. వర్ణవివక్ష విధానాల కారణంగా దక్షిణాఫ్రికాను ఈ క్రీడల నుంచి మినహాయించారు. 15 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో 93 దేశాలకు చెందిన 5,151 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూడో, వాలీబాల్తో పాటు 20 క్రీడల్లో 163 ఈవెంట్లు నిర్వహించారు.
ఈ క్రీడల్లో సోవియట్ యూనియన్ 96 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 90, జర్మనీ 50 పతకాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. హాకీలో భారత్కు ఒకే ఒక్క పతకం స్వర్ణ పతకం వచ్చింది. హాకీ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి 1960 రోమ్ ఒలింపిక్స్కు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నది.
2015: టర్కీలోని అంకారాలో శాంతి ర్యాలీలో బాంబు దాడి, దాదాపు 95 మంది దుర్మరణం
2014 : కైలాస్ సత్యార్థి, మలాలా యూసుఫ్జాయ్కి నోబెల్ శాంతి బహుమతి ప్రకటన
2010: ప్రముఖ గజల్ గాయకుడు జగ్జిత్ సింగ్ ముంబైలో మరణం
2005: జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్గా ఎంపికైన ఏంజెలా మెర్కెల్
1978: జాతీయ చెస్ పోటీలో గెలుపొందిన మొదటి మహిళగా నిలిచిన రోహిణి ఖాదిల్కర్
1970: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఫిజిఽ
1967: అమలులోకి బాహ్య అంతరిక్ష ఒప్పందం
1954: ప్రముఖ భారతీయ సినీ నటి రేఖ జననం
1910: వారణాసిలో మొదటి అఖిల భారత హిందీ సమావేశం
తెలంగాణ చీఫ్ జస్టిస్గా సతీష్ చంద్ర శర్మ.. రాష్ట్రపతి ఆమోదం
చైనా తయారీ టెస్లా కార్లు ఇక్కడ అమ్మొద్దు : నితిన్ గడ్కరీ
కోహ్లీ, రోహిత్ కన్నా ఈ ఆటగాడికి సామర్ధ్యం ఎక్కువ : గంభీర్ వ్యాఖ్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..