ఢాకా: బంగ్లాదేశ్లో 29 మంది హిందువుల ఇండ్లకు దుండగులు నిప్పంటించారు. మరో 66 ఇండ్లను ధ్వంసం చేశారు. బంగ్లాలో ఇటీవల దుర్గాపూజ రోజు, ఆ తర్వాత హిందూ ఆలయాలపై, హిందువులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రంగ్పూర్ జిల్లాలోని మజీపరాకు చెందిన ఓ హిందూ యువకుడు సోషల్ మీడియాలో దైవదూషణ చేశాడన్న వదంతులు వ్యాపించడంతో ఆదివారం రాత్రి అతని ఇంటిపై దుండగులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు అతని ఇంటికి రక్షణగా నిలువగా, దుండగులు సమీపంలోని 29 ఇండ్లకు నిప్పు పెట్టారు.