వాషింగ్టన్: అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర రాజధాని శాంటా ఫీ నగరంలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్పై గత ఏడాది దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఇండియా ప్యాలెస్ హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. గుర్తు తెలియనివాళ్లు గత ఏడాది జూన్లో.. హోటల్లోకి ప్రవేశించి.. కిచెన్, డైనింగ్ రూమ్, స్టోరేజ్ ఏరియాను ధ్వంసం చేశారు. ట్రంప్ 2020 అంటూ ఆ హోటల్ గోడలపై పెయింటింగ్ కూడా వేశారు. ఆ హోటల్ ఓనర్ సిక్కు మతస్తుడు. ఆ దాడి వల్ల సుమారు లక్ష డాలర్ల మేర అతనికి నష్టం వచ్చింది. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. రెస్టారెంట్పై దాడి ఘటనను విద్వేష ఘటనగా చూపిస్తు శాంటా ఫీ పోలీసులు కేసు బుక్ చేశారు. భారతీయ వర్గంపై దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2013లో బల్జీత్ సింగ్ అనే భారతీయ సిక్కు ఆ రెస్టారెంట్ను కొన్నారు. దాన్ని ఆయన కుమారుడు బల్జోత్ నడిపిస్తున్నారు. దాడి జరిగి 16 నెలలు గడుస్తున్నా..ఇంకా ఆ కేసులో ఎటువంటి ఛార్జిషీట్ లేదు. దీంతో ఈ కేసును ఎఫ్బీఐకి అప్పగించారు. ఇండియా ప్యాలెస్ రెస్టారెంట్పై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని గత వారం ఎఫ్బీఐ ఓ ప్రకటనలో చెప్పింది.