ఈజిప్ట్లోని షార్మ్ ఎల్- షేక్ అనే రిసార్ట్లో కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ ప్యారిస్) 27వ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ సమస్య మీద ప్రపంచ నేతలు చర్చించనున్నారు. కాలుష్యం కారణంగా భూమి వేడుక్కుతోంది. మంచు కరిగి పలు దేశాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాప్ 27 సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేలా చూడడం, పర్యావరణ మార్పులతో తీవ్రంగా నష్టపోతున్న పేద దేశాలకు సాయం చేయడం వంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సదస్సు అజెండాలోని లాస్ అండ్ డ్యామేజ్ తీర్మానానికి భారతదేశం మద్దతు తెలిపింది. వంద దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాలొ్ంటున్నారు.
పోయిన ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో సంపన్న దేశాలైన అమెరికా, యూరోపియన్ యూనియన్లోని దేశాలు లాస్ అండ్ డ్యామేజ్ ఫైనాన్సింగ్ బాడీ ఏర్పాటు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. 2005 నుంచి కాప్ సదస్సులు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి వీటిని నిర్వహిస్తోంది.