న్యూయార్క్: ప్రముఖ విద్యావేత్త, ప్రవాస భారతీయుడు సునీల్కుమార్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మసాచుసెట్స్లో ఉన్న టఫ్ట్స్ వర్సిటీ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఓ అమెరికాయేతరుడు ఈ పదవిలో నియమితులు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం జాన్స్ హాప్కిన్స్ వర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న సునీల్ వచ్చే ఏడాది జూలైలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మంగళూరులో ఇంజినీరింగ్ చదివిన సునీల్ ఇల్లినాయిస్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు.