బాకు : మరో మూడు నాలుగేండ్లలో అంగారక గ్రహంపై స్పేస్క్రాఫ్ట్ను స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేస్తుందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. విశ్వ రహస్యాలు తెలుసుకునేందుకు స్పేస్ ఎక్స్ పరిశోధనలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
అజర్బైజాన్లోని బాకులో జరుగుతున్న అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. స్పేస్ ఎక్స్ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల గురించి వివరించారు. స్పేస్ ఎక్స్కు చెందిన స్టార్షిప్ గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.