రోమ్, మార్చి 19: కృత్రిమ ఆకుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ ఆకులను తయారుచేశారు. వీటిని నిజమైన మొక్కలకు పెట్టి గాలి, వర్షం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలికి ఆకులు కదిలినప్పుడు జరిగే రాపిడి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు.