ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆటోమోబిలి పినిన్ఫారినా’.. హైదరాబాద్లో జరుగుతున్న ఈ-మోటర్ షోలో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ‘బటిస్టా’ కారును ఆవిష్కరించింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన అనుబంధ సంస్థే ఇది. ఇటలీలో తయారైన ఈ కారు ప్రపంచంలో ఫాస్టెస్ట్-యాక్సలరేటింగ్ ఎలక్ట్రిక్ కారు ఇదే. దీని ధర సుమారు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 1.86 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు 4.75 సెకన్లలో 200 కిలో మీటర్ల వేగంతో దౌడ్ తీయనున్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్ అండ్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ డైరెక్టర్ సుజయ్ కారంపురి మాట్లాడుతూ.. తెలంగాణకు మహీంద్రా గ్రూపుతో గొప్ప అనుబంధం ఉందని, ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఇటువంటి అత్యాధునిక సాంకేతికతను పొందుతున్నందుకు గర్విస్తున్నామని చెప్పారు. -సిటీబ్యూరో