వాషింగ్టన్: బ్రిటన్లోని ఓ పెంపుడు కుక్కకు కరోనా (Corona) పాజిటివ్ వచ్చిన విషయం మరవక ముందే ఎనిమిది పులులకు (Big Cats) మహమ్మారి నిర్ధారణ అయింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది పులులు కరోనా బారిన పడ్డాయి. ఇందులో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్ టైగర్, ఒక పూమా, రెండు జాగ్వార్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో స్వల్ప లక్షణాలు ఉండగా, మరికొన్ని సర్ది, దగ్గుతో బాధపడుతున్నాయని జూ అధికారులు తెలిపారు.
కాగా, ఇవి మినహా జూలోని 12 వేల జంతువులు క్షేమంగా ఉన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. పులలకు కరోనా (Corona) ఎలా సోకిందనే విషయాన్ని జూ సిబ్బంది ఇంకా గుర్తించలేదని తెలిపింది. గత నెల రోజులుగా జంతుప్రదర్శనశాల అధికారులు జంతువులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు.
అయితే జంతువుల నుంచి ప్రజలకు వైరస్ సోకుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేదవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) వెల్లడించింది. కానీ ప్రజల నుంచి జంతువులకు వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు ఆధారాలున్నాయని తెలిపింది.