న్యూఢిల్లీ, కారకస్, జూన్ 27: అప్ఘానిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పాకిస్థాన్తోపాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపించాయి.
ప్రాణ లేక ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ సమాచారం లేదు. భూకంప కేంద్రం ఈశాన్య అఫ్ఘానిస్థాన్లోని కలఫ్గాన్కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా అఫ్ఘాన్, పాకిస్థాన్, భారత్, చైనా,తజికిస్థాన్, ఉబ్జెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్లో ప్రకంపనలు సంభవించాయి. చాలా లోతులో భూకంపం సంభవించడంతో దాని ప్రకంపనలు విశాలమైన భౌగోళిక ప్రాంతానికి విస్తరించాయి.
వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాల తాకిడిని మరచిపోకముందే మరోసారి భూమి కంపించింది. శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప త్రీవత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదయ్యింది. కారకస్, మరాకే ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.