జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం (earthquake) సంభవించింది. దేశంలోని తూర్పు ప్రావిన్స్ అయిన పపువా బరాత్లో (Papua Barat) గురువారం తెల్లవారుజామున 12.46 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయిందని వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నది. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.